Robbery: బుర్కా వేసుకొచ్చి జువెలరీ షాపు యజమానిపై కత్తితో దాడి 2024-06-20 15:24:49

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ మేడ్చల్ పట్టణంలోని జగదాంబ బంగారం షాపుకు ఇద్దరు దుండగులు బుర్కా వేసుకుని వచ్చి కత్తితో షాపు యజమాని మెడ కింద పొడిచి బంగారం, డబ్బులు ఎత్తుకెళ్లారు. ఈ షాపు మేడ్చల్  పోలీస్ స్టేషన్ పక్కనే ఉండడం గమనార్హం. పల్సర్ బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు పట్టపగలే చాకుతో షాప్ యజమాని శేషరాంను పొడిచి నగలు, డబ్బులను ఎత్తుకెళ్లారు. వీరిలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోగా మరో వ్యక్తి బుర్కా ధరించి వచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ దాడిలో యజామానికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి పోలీసులు తరలించారు.