Tribe Women: పనికి రావట్లేదని మహిళ పై పాశవిక దాడి 2024-06-20 14:41:11

న్యూస్ లైన్ డెస్క్: పనికి రావట్లేదని చెంచు మహిళ మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి పాశవిక దాడికి యాజమాని పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్, కొల్లాపూర్‌లో చోటు చేసుకుంది. మొలచింతలపల్లి గ్రామంలో చెంచు మహిళ ఈశ్వరమ్మ, భర్త ఈదన్న తమ వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చారు. అయితే ఆ భూమిలో వెంకటేశ్‌ ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రం పెట్టుకోగ తన దగ్గరే ఈదన్న, ఈశ్వరమ్మ పని చేసేవారు. ఒక రోజు భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఈశ్వరమ్మ తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఈశ్వరమ్మ పనికి రావట్లేదని యజమాని వెంకటేష్, ఈశ్వరమ్మను పుట్టింటి నుండి తీసుకొచ్చి తన దగ్గరే గదిలో బంధించి పాశవికంగా దాడి చేశాడు. ఈశ్వరమ్మను మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి, కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈశ్వరమ్మను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడ్డా యజామాని వెంటకటేష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.