Girl: మియాపూర్ బాలిక కేసులో కొత్త ట్విస్ట్ 2024-06-19 18:12:04

న్యూస్ లైన్ డెస్క్: మియాపూర్ బాలిక అనుమానాస్పద హత్య కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. బాలిక (12)ని తండ్రి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధరించారు. బాలికను నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లి తన కోరికను తీర్చాలని తండ్రి బలవంత పెట్టినట్లు తెలిపారు. తండ్రి కోరిక విని గట్టిగా అరిచి ఈ వ్యవహారాన్ని తల్లికి చెప్తానని బాలిక ఆరిచింది. అయితే పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసైన బాలిక తండ్రి బానోతు నరేష్ తన కోరిక తీర్చాలంటూ బాలికపై ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి హత్య చేశాడు. బాలికను హతమార్చి నిర్మానుష్య ప్రాంతం నుండి బయటకు వచ్చాడు. కాగా, వారం రోజుల తర్వాత బాలిక మిస్సింగ్ మిస్టరీ బయటపడింది. ఇంటి సమీపంలోనే బాలిక మృతదేహం లభ్యమవడంతో తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసుల దర్యాప్తు చేపట్టారు.

11 నిమిషాల వ్యవధిలోనే బాలికను హత్య చేశాడాని. అనంతరం అక్కడి నుండి నిందితుడు బయటకు వచ్చాడాని తెలిపారు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి హత్య జరిగిన ప్రదేశానికి నిందితుడు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వరుసగా మూడు రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూస్తూ తన కూతురు మిస్ అయినట్లు పోలీసులకు నరేష్ దంపతులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు విచరాణ చేపట్టాగా బాలిక తండ్రి నరేష్ హత్య చేసినట్లుగా పోలీసుల నిర్దారించారు. నాలుగు బృందాలతో సీసీ టీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. స్వగ్రామం మహబూబబాద్ జిల్లా మర్రిపెడ మండల్ ఎల్లంపేట్ గ్రామం లక్ష్మన్ తండాకు బ్రతుకుదెరువు కోసం నడిగడ్డ తండాకు నరేష్ దంపతులు వలసవచ్చారు. వచ్చిన 15 రోజులకే కన్న కూతురును తండ్రి నరేష్ హత్య చేశాడు.