BJP: ఎంపీ ఈటెల మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన 2024-06-19 06:09:44

 

న్యూస్ లైన్ డెస్క్: బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మెడికల్ కాలేజిలో విద్యార్థినులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అధ్యాపకులు వేధిస్తున్నారంటూ ఆర్వీఎం మెడికల్ కాలేజీ విద్యార్థినులు నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని ఆర్వీఎం మెడికల్ కళాశాలలో తమను అధ్యాపకులు దుర్భాషలాడుతూ, బయటకు చెప్పుకోలేని విధంగా మాట్లాడుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థినులు కన్నీళ్ళు పెట్టుకున్నారు. తమ ఫోన్లను తీసుకొని డేటాను చెక్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఓవర్ డ్యూటీలు వేస్తూ సెలవు ఉన్నా సెలవులు ఇవ్వకుండా తమకు మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. అధ్యాపకులను తొలగించి వేరే అధ్యాపకులను నియమించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు.