fire in an airplane: గాల్లో ఉన్న విమానంలో మంటలు 2024-06-20 13:04:35

న్యూస్ లైన్ డెస్క్: ఓ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.  హైదరాబాద్(Hyderabad) నుంచి కౌలాలంపూర్(koulalalmpur) వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్(Malaysia airlines) విమానం టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే ఇంజిన్‌(Engine)లో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన ఫైలెట్ వెంటనే లాండింగ్(landing)కి అనుమతి కోరారు. దీంతో విమానాన్ని సేఫ్(safe)గా లాండింగ్ చేయించారు. విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇంజిన్‌లో మంటలు రావడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. సాంకేతిక కారణాలతో జరిగిందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రయాణికులు మాత్రం ఎయిర్ లైన్స్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైలెట్ టేక్ ఆఫ్ ముందు విమానం కండిషన్ ఎందుకు పరిశీలించలేదని మండిపడుతున్నారు. అప్రమత్తత లేకపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని భయాందోళన చెందారు.