Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు 2024-06-20 13:18:29

న్యూస్ లైన్ డెస్క్: పటాన్‌చెరు(Patan Cheru) బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(Goodem Mahipal Reddy), ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి(madhusudan reddy) ఇళ్లలో ఈడీ(ED) అధికారుల సోదాలు జరుపుతున్నారు. తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో ఇద్దరు ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. అటూ వీళ్ల బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుపుతున్నారు. అన్నదమ్ముల ఇళ్లలో సోదాలు జరగడంపై నియోజకవర్గంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు అన్నదమ్ములకు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. గతంలో లగ్డారం మైనింగ్ విషయంలో కేసు నమోదైంది. దీని ఆధారంగానే ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.