న్యూస్ లైన్ డెస్క్: ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రుణమాఫీ విధివిధానాల ఖరారు, రైతు బరోసా పై చర్చ జరగనుంది. అలాగే బడ్జెట్ సమావేశాలు, రాష్ట్ర కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు పలు అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.