Bhatti: దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ 2024-06-19 16:03:34

న్యూస్ లైన్ డెస్క్: దేశంలో తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన 41వ బ్యాంకర్ల రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గతం నుండే ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని, రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్  ఉందన్నారు. రానున్న రోజుల్లో రీజినల్ రింగ్ రోడ్డు తీసుకు రాబోతున్నామని తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ అనేది హైదరాబాద్ నగరానికి ఫేస్ లిఫ్ట్‌గా చేయబోతున్నామన్నారు. ఏ పరిశ్రమ పెట్టిన, ఏ ఇండస్ట్రీ పెట్టినా వాటికి కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ ఇక్కడ ఉందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బ్యాంకులు రుణాలు పెంచాలన్నారు. దశాబ్దాలుగా రైతే రాజు అంటున్నారని, కానీ గణాంకాలు చూస్తే భయం వేస్తుందని తెలిపారు. రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయన్నారు. బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వలని భట్టి ఈ సంద్భంగా తెలిపారు.