న్యూస్ లైన్ డెస్క్: సికింద్రాబాద్(secunderabad) రైల్వే స్టేషన్(railway station)లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే నిలయం పక్కనున్న రైల్వే బ్రిడ్జి(railway bridge)పై ఆగి ఉన్న రైలులో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. భారీగా పొగలు కమ్ముకున్నాయి. ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటినా చేరుకున్న సిబ్బంది, అగ్నిమాపక మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
రైలులో మంటలు ఎలా చెలరేగాయినే దానిపై అధికారుల విచారణ జరుపుతున్నారు. షార్ట్ సర్క్యూట్(short circuit) వల్ల జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో రైలులో ప్యాసింజర్స్(passengers) లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు.