న్యూస్ లైన్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో వంద రోజుల ప్రణాళిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశ ఆర్థిక స్థితిగతులు, చేపట్టబోయే చర్యలపై కేబినెట్లో చర్చ జరుగుతుంది. బడ్జెట్ పైనా ఈ కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. జులైలో పూర్తి బడ్జెట్ పెట్టేందుకు ఎన్డీయే సర్కార్ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించారు. అయితే జులై 18న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.