న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో(RELIANCE JIO) సర్వర్లు డౌన్ అయిపోయాయి. దీంతో చాలా మంది మొబైల్, జియో ఫైబర్ వినియోగదారులు నెట్ రాక ఇబ్బందులు పడ్డారు. ఇప్పటి వరకు జియో ఫైబర్కు సంబంధించి 38 శాతం మంది, మొబైల్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించి 54 శాతం మంది ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది.
రిలయన్స్ జియో(RELIANCE JIO) మాత్రం అధికారికంగా ఈ విషయమై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కస్టమర్ కేర్ పై తెగ సీరియస్ అయిపోతున్నారు నెటిజన్లు. కారణం చెప్పలేదని...ఇలా వీక్ డేస్ లో సర్వర్ డౌన్ అవ్వడం ఉద్యోగస్తులకు చాలా ఇబ్బంది అని వాపోయారు.
దీనిపై సంస్థ ఇప్పటి వరకు స్పందించకపోవడంతో జియో కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాల్లో ఇంటర్నెట్ అంతరాయంపై పలు పోస్ట్లు పెడుతున్నారు. ఫిర్యాదులూ చేస్తున్నారు. ఇతర కంపెనీల హాట్ స్పాట్ సేవలే జియో సేవల కంటే మెరుగ్గా ఉన్నాయంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.